Fake water bills : ఢిల్లీవాసులకు శుభవార్త. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. త్వరలో ‘వన్ టైమ్ వాటర్ బిల్లు సెటిల్మెంట్’ (One Time Water Bill Settlement’)పథకాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మంత్రి సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం తెలిపారు. ఈ ప్రతిపాదనను జలమండలి (Water Board)ఆమోదించిందని తెలిపారు. త్వరలోనే మంత్రివర్గంలో ప్రతిపాదన తీసుకురానున్నట్లు వెల్లడించారు. వన్ టైమ్ సెటిల్మెంట్ బిల్లును కేబినెట్ ఆమోదించిన తర్వాత అమలులోకి వస్తుంది. ఫేక్ వాటర్ బిల్లుల (Fake water bills)సమస్య నుండి ఢిల్లీ ప్రజలకు ఉపశమనం కలిగించడమే ఈ పథకం లక్ష్యం.
పూర్తిగా చదవండి..‘వన్ టైమ్ వాటర్ బిల్లు సెటిల్మెంట్’ అంటే ఏమిటి? ప్రభుత్వం ఈ పథకాన్నిఎందుకు తీసుకురాబోతోంది..!!
ఢిల్లీవాసులకు గుడ్ న్యూస్. వన్ టైమ్ వాటర్ బిల్ సెటిల్మెంట్ స్కీంను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఫేక్ వాటర్ బిల్లుల సమస్య నుంచి ఢిల్లీ ప్రజలకు విముక్తి కల్పించడమే ఈ పథకం లక్ష్యం.
Translate this News: