/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/CM-Kejriwal-jpg.webp)
CM Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. మరోసారి జ్యూడిషియల్ కస్టడీని పొడిగించింది. జులై 3 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. కాగా నేటితో జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ ను జైలు నుంచి వీడియో కాల్ ద్వారా కోర్టు విచారణ చేపట్టింది. అలాగే ఈ కేసులో బెయిల్ కావాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఆ పిటిషన్ను తోసిపుచ్చింది. కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడం ద్వారా అతను కేసులోని కీలక విషయాలను, ఆధారాలను మార్చుతారని ఈడీ కోర్టులో వాదనలు వినిపించింది. ఈ కేసులో పురోగతి వచ్చేందుకు తమకు కేజ్రీవాల్ ను విచారించేందుకు మరికొంత సమయం కావాలని న్యాయమూర్తిని ఈడీ కోరింది. ఈడీ వాదనలకు సానుకూలంగా స్పందించిన కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది.
Delhi Court extends judicial custody of Chief Minister Arvind Kejriwal in liquor policy case till July 03. #ArvindKejriwal #ED
— Live Law (@LiveLawIndia) June 19, 2024