Dasthagiri: జగన్ కు ఓటు వేసి అధికారం ఇస్తే జరిగేది ఇదే: దస్తగిరి

జై భీమ్ పార్టీలో జాడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో10 మంది దస్తగిరి కార్యకర్తలు పార్టీలో చేరారు. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి పులివెందుల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే తనకు ప్రాణ హాని ఉందని చెప్పుకొచ్చారు.

New Update
Dasthagiri: జగన్ కు ఓటు వేసి అధికారం ఇస్తే జరిగేది ఇదే: దస్తగిరి

Dasthagiri: విజయవాడలో జై భీమ్ రావ్ భారత్ పార్టీ ఆఫీసులో జాడ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో దస్తగిరి కార్యకర్తలు 10 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యాలయంలో దస్తగిరి ప్రెస్ మీట్ నిర్వహించారు. పులివెందుల నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే తనకు ప్రాణ హాని ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Also Read: టీడీపీలో టికెట్ల లొల్లి.. చంద్రబాబు నివాసం ఎదుట ఆందోళనలు

తాను అన్ని పార్టీలను దగ్గర నుండి చూశానని..దళిత సంఘాలకు దళితులకు న్యాయం జరిగే పార్టీ జై భీమ్ రావ్ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఒక సీనియర్ న్యాయవాది పార్టీ కావడంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పులివెందులలో పోటీ చేయడానికి గల కారణం ఎంటో అందరికీ తెలుసని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో జనాలను మోసం చేసి మళ్ళీ రాజకీయలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

Also Read: కర్నూలు ప్రజలకు అలర్ట్.. ఆ ఏరియాలకు వాటర్ బంద్!

దళితులను మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసాడని..రాష్ట్రంలో రాజా రెడ్డి పాలన జరిగిందని ఆరోపించారు. దళితులకు జగన్ ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. ఇంకోసారి జగన్ కి ఓటు వేసి అధికారం ఇస్తే  మన గొంతు మనం కోసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే మైనారిటీలకు ప్రధాని మోదీ Caa తీసుకువచ్చరని.. అయితే, తాము ఎమైనా తీవ్రవాదులమా అని ప్రశ్నించారు.

Advertisment
తాజా కథనాలు