Guntur : గుంటూరు జిల్లాలో దారుణం.. ప్రియుడిపై కోపంతో ఇంటికి నిప్పంటించిన ప్రియురాలు

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది.

New Update
guntur

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో అతని ఇంటికే నిప్పంటించింది. ఈ ఘటనలో ప్రియుడితో పాటు అతని భార్య, కుమారుడు, తల్లి, మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఆరుగురు గ్రామస్థులు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెనాలి సీఎం కాలనీకి చెందిన దుర్గ(28)కు, సుద్దపల్లికి చెందిన మల్లేష్(30)తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అయితే, గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మల్లేష్ తనను దూరం పెడుతున్నాడనే కోపంతో రగిలిపోయిన దుర్గ, ఎలాగైనా అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది.

వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను

ఆదివారం తెల్లవారుజామున మల్లేష్ ఇంటికి చేరుకున్న దుర్గ, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇంట్లోకి పోసి నిప్పంటించింది. ఆ సమయంలో ఇంట్లో మల్లేష్‌తో పాటు అతని భార్య, కుమారుడు, తల్లి నిద్రపోతున్నారు. మంటలు అంటుకోవడంతో బాధితులు కేకలు వేశారు. అది గమనించిన గ్రామస్థులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మల్లేష్ కుటుంబ సభ్యులతో పాటు, ఆరుగురు గ్రామస్థులకు కూడా గాయాలయ్యాయి. నిందితురాలు దుర్గకు కూడా మంటలు అంటుకుని స్వల్పంగా గాయపడింది.

తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం గుంటూరు జిజిహెచ్ కు తరలించగా, మరో ఐదుగురికి వడ్లమూడిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Advertisment
తాజా కథనాలు