/rtv/media/media_files/2025/04/20/dUJ9STFBAbk2jY8Qk8Qt.jpg)
17-years old
రాజస్థాన్ లో ఓ 17 ఏళ్ల ఓ బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన లాలిబాయి మోగియా అనే మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబర్ 7న ఈ ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించింది. బాధితురాలి తల్లి ఆరోపిస్తూ నిందితురాలు ఒక హోటల్ గదికి తమ కుమారుడిని తీసుకువెళ్లి అక్కగ మద్యం తాగించి ఆరు నుంచి ఏడు రోజుల పాటు లైంగిక దాడికి పాల్పడిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Aslo Read : Harassment of Hijras : బరితెగించిన హిజ్రాలు..డబ్బులు ఇవ్వలేదని..అది లేపి(వీడియో)
రూ.45వేల జరిమానా
తల్లి ఫిర్యాదు ఆధారంగా, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 363 (కిడ్నాప్), జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ, రక్షణ) చట్టం మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేయబడింది. తాజాగా దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి లైంగిక దోపిడీకి IPC మరియు POCSO చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద దోషిగా నిర్ధారించి, 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా రూ.45వేల జరిమానా విధించింది.
Also read : Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్