అమెరికా నుంచి రప్పించి.. సినిమా లెవెల్‌లో కిడ్నాప్

విశాఖకు చెందిన జమీనా అనే యువతికి మనోహర్‌ అనే ఎన్ఆర్ఐ ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడు. పక్కా ప్లాన్ తో అతడిని అమెరికా నుంచి రప్పించిన ఆ యువతి మత్తు డ్రింక్ ఇచ్చి సన్నిహితంగా ఉన్నట్లు ఫొటోలు తీసుకుంది. అనంతరం బెదిరించి కిడ్నాప్ కూడా చేయగా.. తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు.

New Update

ఇన్‌స్టాలో పరిచయం అయిన వ్యక్తికి వల వేసి కిడ్నాప్ చేసిన సంఘటన విశాఖలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. విశాఖకు చెందిన జమీనా అనే యువతికి అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ మనోహర్‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. మనోహర్ తల్లిదండ్రులు విశాఖలోనే ఉండటంతో జమీనా వారి తల్లిదండ్రులో పరిచయం పెంచుకుంది. మనోహర్‌ను పెళ్లి చేసుకుంటానని అతని పేరెంట్స్‌కు చెప్పింది. కానీ అతని తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దీంతో అమెరికా నుంచి మనోహర్‌ను రప్పించిన జమీనా తన ఇంటికి తీసుకెళ్లింది.

ఇది కూడా చూడండి: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ సిక్కోలు జిల్లా

మత్తు పానీయం ఇచ్చి..

మత్తు పానీయం ఇచ్చి అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తీసింది. అవి చూపించి తనని పెళ్లి చేసుకోవాలని మనోహర్‌ను బ్లాక్ మెయిల్ చేసింది. ఈ క్రమంలో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి బలవంతంగా నిశ్చితార్థం చేయించింది. మనోహర్‌ను బంధించి ఇంట్లోనే ఉంచగా.. ఏదో విధంగా అతను తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఆమె దగ్గర ఉన్న ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా ఇలానే కొందరిని మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేసిందని పోలీసులు విచారణలో వెల్లడించారు.

ఇది కూడా చూడండి: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు