ఎంత పనిచేశారమ్మ... అప్పుల బాధకు ఐదుగురు బలి!

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది.  అప్పుల బాధ నుంచి వేధింపులు భరించలేక ఓ జంట తాము విషం తీసుకుని,  తమ పిల్లలకు కూడా విషమిచ్చారు.  ఇందులో మహిళ ఆమె కుమారుడు మృతి చెందగా, ఆమె భర్త, మరో ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు.

New Update
up couple

up couple Photograph: (up couple)

ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది.  అప్పుల బాధ నుంచి వేధింపులు భరించలేక ఓ జంట తాము విషం తీసుకుని,  తమ పిల్లలకు కూడా విషమిచ్చారు.  ఇందులో మహిళ ఆమె కుమారుడు మృతి చెందగా, ఆమె భర్త, మరో ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం  వికాస్ (45), రజనీ (35) ఫ్యూజన్ అనే చిన్న ఫైనాన్స్ కంపెనీలో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అప్పుగా తీసుకున్నారు. సకాలంలో EMIలు చెల్లించలేకపోవడంతో కంపెనీ అధికారులు వారిని వేధించడం మొదలుపెట్టారు. 

తరచుగా వారి ఇంటికి వెళ్లి, బెదిరించడం స్టార్ట్ చేశారు. దీంతో దీనిని అవమానంగా భావించిన  ఈ దంపతులు విషం తీసుకుని చనిపోవాలని డిసైడ్ అయ్యారు.  దీంతో పిల్లలకు విషం ఇచ్చి వారు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  సహరాన్‌పూర్‌లోని గగల్‌హెడి-డియోబంద్ రహదారిపై  ఐదుగురు కుటుంబ సభ్యులు అపస్మారక స్థితిలో ఉంటటం గమనించిన ఓ వ్యక్తి వారిని ఆసుపత్రికి తరలించారు. ముందుగా వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి మరో వైద్యశాలకు రెఫర్ చేశారు.  సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. 

అయితే, చికిత్స పొందుతూ రజనీ, ఆమె ఏడాదిన్నర కుమారుడు మృతి చెందగా, వికాస్ మరో ఇద్దరు పిల్లలు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సహరాన్‌పూర్ ఎస్పీ సిటీ వ్యోమ్ బిందాల్ మాట్లాడుతూ, "భర్త, భార్య, వారి ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దురదృష్టవశాత్తు, వారిలో ఒకరు- భర్త భార్య రజని కూడా చికిత్స పొందుతూ మరణించింది" అని తెలిపారు.  

మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనే 

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గురువారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అప్పుల బాధతో భార్యాభర్తలు తమ పిల్లలకు విషమిచ్చి ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్, సల్ఫేట్ మాత్రల ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దంపతులు ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్‌లో దంపతులు పడ్డ కష్టాలను వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు