/rtv/media/media_files/2025/01/29/4ph3sPUtxSIMiQkqnZX5.webp)
Bahadurpura Crime News
Cime: తమిళనాడు రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కన్న తండ్రి క్షణికావేశానికి ముగ్గురు చిన్నారులు బలయ్యారు. నమక్కల్ జిల్లా రాశిపురంలో నివాసం ఉంటున్న గోవిందరాజు అనే వ్యక్తి క్షణికావేశంలో అత్యంత కిరాతకంగా ముగ్గురు కూతుళ్ళ గొంతుకోసి చంపేశాడు. అంతేకాదు కూతుళ్లను చంపడానికి ముందుకు భార్య, కొడుకును గదిలో వేస్ బంధించాడు. దీంతో వారు కూడా ఈ ఘోరాన్ని ఆపలేకపోయారు. తండ్రి మూర్ఖత్వానికి ముగ్గురు కూతుళ్లు ప్రతీష శ్రీ, రితిక శ్రీ, దేవశ్రీ అక్కడిక్కడే మరణించారు. ఆ తర్వాత గోవిందరాజు కూడా విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే ఆర్ధిక ఇబ్బందులే ఈ ఘటనకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఆర్థిక ఇబ్బందులకు చావే పరిష్కారం అనుకున్నాడు గోవిందరాజు! సమస్యలను ఎదిరించి నిలబడలేక క్షణికావేశంలో తనతో పాటు ముగ్గురు కూతుళ్లను బలి తీసుకున్నాడు. కన్న కూతుళ్లు, భర్తను కళ్ళ ముందే కోల్పోవడంతో గోవింద్ రాజ్ భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
కేరళలో మరో ఘటన
ఇదిలా ఉంటే.. ఇటీవలే కేరళలో ఓ తండ్రి ఆర్ధిక ఇబ్బందులతో కుమారుడి ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కేరళలోని పతనంతిట్ట జిల్లాకు చెందిన 47 ఏళ్ల వీటీ షిజో అనే వ్యక్తి ఒక కొడుకు ఉన్నాడు. అయితే అతడికి ఇటీవలే ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చింది. దీంతో కాలేజ్ అడ్మిషన్ ఫీజు విషయం గురించి తండ్రితో చెప్పాడు. కానీ, తండ్రి షిజో కొడుకు అడ్మిషన్ ఫీజు ఏర్పాటు చేయలేకపోయాడు. దీంతో తీవ్ర నిరాశ, మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ముంగంపర అడవిలోని ఒక చెట్టుకు అతడి శవం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారించగా.. ఆర్ధిక ఇబ్బందులే షిజో సూసైడ్ కి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి తోడు స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న అతడి భార్య జీతం కూడా 12 ఏళ్లు పాటు ఆగిపోగా.. గత కొన్ని నెలలుగా నుంచి వస్తోంది. ఇలా చాలా ఏళ్ళ పాటు ఒక్కడి సంపాదన మాత్రమే ఉండడంతో ఆర్థికంగా బలహీన పడ్డారు.
Also Read : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!
గతంలో కూడా ఆర్ధిక సమస్యలతో ప్రాణాలు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇల్లు గడవక, పిల్లలను చదివించలేక, అప్పుల పాలై, ఇలా రకరకాల ఆర్ధిక సమస్యలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం సమాజంలో పెరుగుతున్న స్కూల్, కాలేజీ ఫీజులు తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారుతున్నాయి. సంపాదించి అంతా పిల్లల చదువులకే సరిపోతుంది. ఒక్క సంవత్సరానికి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు. ఓ వైపు ఫీజులు భారం, మరోవైపు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆవేదనతో మధ్యతరగతి తల్లిదండ్రులు సతమతమవుతున్నారు.
Also Read: Folk Song: 'బొంబైకి రాను' తర్వాత మరో పాటతో దుమ్మురేపుతున్న రాము రాథోడ్ .. ప్రోమో చూశారా