Rashmika Post: నా గుండె పగిలింది.. కర్నూల్ బస్ ప్రమాదంపై రష్మిక కన్నీటి పోస్ట్!

కర్నూల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

New Update
rashmika

rashmika

Rashmika Post: కర్నూల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటి రష్మిక మందన్న ఈ ఘటనపై స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. కర్నూల్ ప్రమాద వార్త విని నా గుండె ముక్కలైంది! నా మనసు ఎంతో కలత చెందింది. మంటల్లో కాలుతున్న ఆ బస్సు లోపలి ప్రయాణికుల బాధ వర్ణనాతీతం. కాలిపోయే ముందు వాళ్ళ బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ ప్రమాదంలో చిన్న పిల్లలతో సహా  ఒక కుటుంబం అంతా ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు నటి రష్మిక.

rashmika
rashmika

Also Read: Akhanda 2: సౌండ్ కంట్రోల్ పెట్టుకో.. 'అఖండ 2’ బ్లాస్టింగ్‌ రోర్‌! గూస్ బంప్స్ వీడియో

#Latest News
Advertisment
తాజా కథనాలు