తెలంగాణలో ఘోర విషాదం.. ఆ కాలువలో గల్లంతైన యువకులు!

తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. దానవాయిగూడెంలోని NSP కాలువలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. భరత్ మృతదేహం లభించగా.. రమేష్, ప్రసాద్ అచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన వివరాలు తెలియాల్సివుంది. 

New Update
dre534w2

Khammam: తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. దానవాయిగూడెంలోని NSP కాలువలో పడి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. వారిని భద్రాధ్రికొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన చల్లా రమేష్, ప్రసాద్, బండారు భరత్ గా పోలీసులు గుర్తించారు. అయితే గల్లంతైన ముగ్గురిలో భరత్ (30) అనే యువకుడు మరణించగా మరో ఇద్దరికోసం గాలిస్తున్నారు. 

స్నేహితుడితో ములాఖత్ అయ్యేందుకు వెళ్లి.. 

మాదకద్రవ్యాల రవాణా కేసులో పట్టుబడి ఖమ్మం జిల్లా జైలులో ఉన్న స్నేహితుడు చల్లా రాముతో ములాఖత్ అయ్యేందుకు సోమవారం ఆటోలో మణుగూరు నుంచి ఖమ్మం వచ్చిన వెంకటెశ్వర్లు, రమేష్, ప్రసాద్, భరత్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ములాఖత్ అనంతరం రాత్రి వరకు మద్యం సేవించిన నలుగురు యువకులు.. దానవాయిగూడెం సమీపంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాలువ కట్ట వద్ద రాత్రంతా ఆటోలోనే నిద్రించారు. అయితే మంగళవారం తెల్లారే సరికి స్నేహితులు కనిపించకపోవడంతో వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటన స్థలానికి చేరకుని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు