విషాదం.. కాల్వలో ముగ్గురు గల్లంతు

ఖమ్మం జిల్లాలో ఎన్‌ఎస్‌పీ కాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. జైల్లో ఉన్న స్నేహితుడిని కలిసి వస్తుండగా మద్యం సేవించి కెనాల్‌లోకి దిగారు. మద్యం మత్తులో ముగ్గురు కొట్టుకుపోగా ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా వారి మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

missing
New Update

ఖమ్మం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ములాఖత్‌కి వెళ్లి వస్తుండగా కాల్వలో గల్లంతైన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దానవాయిగూడెంలోని ఎన్‌ఎస్‌పీ కాల్వలో ముగ్గురు గల్లంతయ్యారు. కొత్తగూడెం జిల్లా మణుగూరుకి చెందిన రమేష్, ప్రసాద్, భరత్, వెంకటేశ్వర్లు రిమాండ్ ఖైదీగా ఉన్న స్నేహితుడిని కలవడానికి ఆటోలో జైలుకు వెళ్లారు. ఆ తర్వాత రాత్రి అందరు కలిసి మద్యం సేవించి ఎన్‌ఎస్‌పీ కెనాల్ దగ్గర ఆటో ఆపారు.

ఇది కూడా చూడండి: ఘోర ప్రమాదం.. 23 మంది దుర్మరణం

మద్యం మత్తులో..

వెంకటేశ్వర్లు ఆటోలో నిద్రపోతుండగా.. రమేశ్, ప్రసాద్, భరత్ కెనాల్‌లోకి దిగడంతో మద్యం మత్తులో నీటిలో కొట్టుకుపోయారు. ఉదయం వెంకటేశ్వర్లు లేచి చూసే సరికి ముగ్గురు కనిపించలేదు. ముగ్గురి కోసం వెతుకుతుండగా కెనాల్ దగ్గర వారి దుస్తులు కనిపించాయి. వెంకటేశ్వర్లు వెంటనే బంధువులు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా భరత్ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: దారుణం.. మైనర్‌ను ప్రెగ్నెంట్ చేసిన వృద్ధుడు

 

 

#crime
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe