/rtv/media/media_files/2025/08/21/honey-trap-2025-08-21-21-03-45.jpg)
హైదరాబాద్లోని అమీర్పేట్ లో హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. 81 ఏళ్ల వృద్ధుడిని మోసం చేసి రూ. 7 లక్షలు కాజేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా నిందితురాలు ఆ వృద్ధుడిని వాట్సాప్ ద్వారా పరిచయం చేసుకుని ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టింది. అతనికి దగ్గరై, ఇద్దరు శృంగారంలో పాల్గొన్నట్లు వీడియో రికార్డు చేసింది. ఆ వీడియో రికార్డును ఆధారంగా చేసుకుని మరోకరి చేత ఆ మహిళ వృద్ధుడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది.
హనీ ట్రాప్లో పది రూ.7.11 లక్షలు పోగొట్టుకున్న 81 ఏళ్ల వృద్ధుడు
— Volganews (@Volganews_) August 21, 2025
అమీర్ పేట్కు చెందిన 81 ఏళ్ల వృద్ధుడికి మాయ రాజ్పుత్ అనే మహిళ పేరుతో వాట్సాప్లో కాల్స్, మెసేజ్స్ చేసిన స్కామర్స్
చనువు ఏర్పడ్డాక వృద్ధుడిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ట్రాప్
వైద్య ఖర్చులు, తాకట్టు… pic.twitter.com/wG3FxUVMzj
డబ్బులు ఇవ్వకపోతే
తన భర్తకు ఈ విషయం తెలిస్తే గొడవ అవుతుందని, డబ్బులు ఇవ్వకపోతే వీడియోను లీక్ చేస్తామని బెదిరించింది. బ్లాక్ మెయిల్ తో భయపడిన ఆ వృద్ధుడు ఆ మహిళకు పలు దఫాలుగా మొత్తం రూ. 7 లక్షలు ఇచ్చాడు. పదేపదే డబ్బులు డిమాండ్ చేయడంతో విసిగిపోయిన వృద్ధుడు ఈ విషయంపై తన కుటుంబ సభ్యులతో చర్చించాడు. వారి సూచన మేరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. అమీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బ్లాక్ మెయిల్ చేసిన మహిళ, ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో ఈ ముఠా గతంలో కూడా ఇటువంటి నేరాలకు పాల్పడిందా అని పరిశీలిస్తున్నారు. పోలీసులు ప్రజలను, ముఖ్యంగా వృద్ధులను అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.