Pregnancy : 9 నెలల నకిలీ గర్భం.. బాత్రూంలో అబార్షన్!

తెలంగాణ జనగామ జిల్లాకు చెందిన పల్లవి అనే వివాహిత 9 నెలలుగా నకిలీ గర్భంతో అందరిని నమ్మించి చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఆస్పత్రిలో చేరిన పల్లవి బాత్రూమ్ లోనే అబార్షన్ కావడంతో మగబిడ్డ డ్రైనీజీలో జారిపోయిందంటూ డ్రామా ఆడింది.

author-image
By srinivas
New Update
pregnency

Pregnancy :

పెళ్లై రెండేళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఓ మహిళ తాను గర్భం దాల్చినట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించిన సంఘటన తెలంగాణలోని జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. పాలకుర్తి మండలంలోని మొండ్రాయి తండాకు చెందిన ధరావత్ పల్లవి అనే వివాహిత తాను ప్రెగ్నెంట్ అంటూ  9 నెలలుగా నకిలీ గర్భంతో అందరిని నమ్మించి చివరికి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తొమ్మిది నెలలు నిండగానే నొప్పులు వస్తున్నాయంటూ జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. ఈ క్రమంలోనే మల విసర్జనకు వెళ్లిన పల్లవి.. అరగంట తర్వాత బయటకు వచ్చి బాత్రూంలో అబార్షన్ అయిందని చెప్పింది. అయితే బాబు బయటపడగానే డ్రైనేజీలోకి జారిపోయాడంటూ కన్నీటి పర్యంతమైంది.

దీంతో బాత్రూమ్ తో పాటు పైప్ లైన్‌లోనూ ఆసుపత్రి సిబ్బంది వెతికారు. ఎక్కడ బ్లడ్, తదితర ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే పల్లవికి వైద్య పరీక్షలు నిర్వహించగా అసలు విషయం బటయపడింది. ఆమె గర్భం దాల్చలేదని గుర్తించిన ఎంసిహెచ్ డాక్టర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు, భర్తతోపాటు బంధువులను నిలదీయడంతో పిల్లలు పుట్టకపోయేసరికి ఇలా చేశానని పల్లవి చెప్పింది. దీంతో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ దామోదర్‌రెడ్డి పల్లవి దంపతులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.

 

Advertisment
తాజా కథనాలు