బెంగళూరులో దారుణ ఘటన.. యువతిని 32 ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్‌లో..

బెంగళూరులో శ్రద్ధావాకర్ తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. వయాలికావల్‌లో ఒంటరిగా ఉంటున్న 29 ఏళ్ల యువతిని 32 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.

Crime News : వీళ్ళసలు మనుషులేనా? చిన్నారిని చిదిమేసిన కన్నతండ్రి.. మేనమామ..అన్న! 
New Update

బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 29 ఏళ్ల యువతిని చంపి ముక్కలగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఘటన భయపెట్టిస్తోంది. బెంగళూరులోని వయాలికావల్‌లో ఒంటరిగా నివసిస్తోన్న యువతిపై ఈ దారుణానికి పాల్పడ్డారు. ఒంటరిగా నివసిస్తున్న ఆ యవతిని చూసేందుకు నిన్న తల్లి, చెల్లి రావడంతో ఈ ఘటన బయటపడింది. ఇంట్లో దుర్వాసన రావడంతో ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఇది వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ యువతి వేరే ఇతర రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. 

మొత్తం 32 ముక్కలు..

ఆ మహిళ శరీర భాగాలను నరికి మొత్తం 32 ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. దాదాపుగా ఐదు రోజుల నుంచి శరీర భాగాలు ఫ్రిడ్జ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ మహిళ ఎవరు? ఎందుకు చంపారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. 

#crime
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe