Crime News: కుక్కతో సహా తల్లినీ.. కూతుర్నీ చంపి ఆత్మహత్య చేసుకున్న అకాలీదళ్ నాయకుడు 

పంజాబ్ లో అకాలీదళ్ నాయకుడు కుల్వీర్ సింగ్ మాన్ తన తల్లి, కూతుర్లను రివాల్వర్ తో కాల్చి చంపేశాడు. తరువాత అతను కూడా తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బర్నాలలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

New Update
Crime News: కుక్కతో సహా తల్లినీ.. కూతుర్నీ చంపి ఆత్మహత్య చేసుకున్న అకాలీదళ్ నాయకుడు 

Crime News:పంజాబ్‌లోని బర్నాలాలో అకాలీదళ్ నాయకుడు కుల్వీర్ సింగ్ మాన్ తన తల్లిని, కూతురిని కాల్చి చంపడమే కాకుండా.. ఇంట్లోని పెంపుడు కుక్కను కూడా కాల్చేశాడు. ఆ తర్వాత రివాల్వర్‌తో  కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన జరిగిన సమయంలో కుల్వీర్ భార్య ఇంట్లో లేదు. శనివారం సాయంత్రం పాలు తేవడం కోసం వెళ్లింది. భార్య ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే కుల్వీర్ ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు.

Crime News: ఈ ఘటన బర్నాలాలోని రామరాజ్య కాలనీలోని కోఠి నంబర్ 353లో చోటుచేసుకుంది. మృతుల్లో కుల్వీర్‌తో పాటు అతని తల్లి బల్వంత్ కౌర్, కుమార్తె నిమ్రత్ కౌర్ కూడా ఉన్నారు. అక్కడి మీడియా సమాచారం ప్రకారం అకాలీ నాయకుడు కుల్వీర్ అరగంటలోనే ఈ నేరానికి పాల్పడ్డాడు. అతని భార్య రమణదీప్ కౌర్ కుక్కకు పాలు తెచ్చెదుకు వెళ్లింది. అరగంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి లోపల నాలుగు మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఇది చూసి ఆమె కేకలు వేసింది. రమణదీప్‌ గొంతు విని ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి, పరిస్థితి చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించి కేసు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కుల్వీర్ తన 21 ఏళ్ల కుమార్తె నిమ్రత్ కౌర్‌పై చాలా బుల్లెట్లను కాల్చాడు. వృద్ధ తల్లి బల్వంత్ కౌర్‌ను ఒక బుల్లెట్‌తో కాల్చి చంపాడు. కుక్కను కూడా ఒక బుల్లెట్‌తో కాల్చారు. పెంపుడు కుక్క మొరుగుతోందని కుల్వీర్ దానిని చంపేశాడు. కుల్వీర్ దగ్గర రివాల్వర్ పడి ఉంది. అంతేకాకుండా ఇంటి తలుపు కూడా లోపల నుంచి తాళం వేసి ఉంది. తర్వాత అతని భార్య సెక్యూరిటీ గార్డు సహాయంతో దాన్ని తెరిచింది. ఈ ఘటన మొత్తం ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డైంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కుల్వీర్‌ కోట్ల ఆస్తికి యజమాని..

Crime News: కుల్వీర్ మాన్ అకాలీ నాయకుడు. అతను బర్నాలా నగరంలో యూత్ అకాలీ నాయకుడిగా కూడా పనిచేశాడు. ఇది కాకుండా, మన్ చాలా కాలం పాటు బాబా కలా మహీర్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. సామాజిక కార్యకర్తగా మన్ కు నగరంలో మంచి ఇమేజ్ వచ్చింది. కుల్వీ గతంలో సంఘేతా రోడ్‌లోని బాబా కాలా మహిర్ స్పోర్ట్స్ స్టేడియం సమీపంలో నివసించేవారు. కొంతకాలం క్రితం నగరంలోని తిక్రివాలా రోడ్డులోని రామరాజ్య కాలనీలో రూ.2 కోట్లు వెచ్చించి ఈ కొత్త ఇంటిని కొనుగోలు చేశాడు. కెనడాలో చదువుతున్న తన కుమార్తెను కూడా కెనడా ఇంటికి తీసుకెళ్లాడు. నిమ్రత్ కొద్ది రోజుల క్రితమే కెనడా నుంచి ఇంటికి వచ్చింది.

డిప్రెషన్‌తో కుల్వీర్.. 

ఇప్పటి వరకు జరిగిన విచారణలో కుల్వీర్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తేలిందని బర్నాలా డీఎస్పీ తెలిపారు. దీనికి మందులు కూడా వేసుకున్నాడు. కుల్వీర్ తన కూతురిని మొదట కొట్టినట్లు ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలో తేలిందని డీఎస్పీ తెలిపారు. ఆ తర్వాత తల్లిని, కుక్కను చంపేశాడు. దీని తర్వాత తనను తాను కాల్చుకున్నాడు. మృతదేహాలను సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. కుల్వీర్ భార్య వాంగ్మూలం తర్వాత పోలీసులు సెక్షన్ 174 కింద చర్యలు ప్రారంభించారు. అయితే ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.

Advertisment
తాజా కథనాలు