వరదలే కాదు మూగజీవాలు కూడా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉప్పెనలా వచ్చిన వరదలకు కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్న మైపోతుంటే.. మరో వైపు అంబేద్కర్ కోనసీమ జిల్లా(ambedkar konaseema district) రాజోలు మండలం బి.సావరం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తోంది. ఆరుబయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్న పిల్లలపై దాడి చేసింది. వారిని తీవ్రంగా గాయ పరిచింది. కుక్క దాడిలో గాయపడిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరిని ప్రథమ చికిత్స కోసం రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరొకరికి ఎక్కువ గాయాలు కావడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కుక్కల బారి నుంచి కాపాడాలంటూ బీసవరం గ్రామస్తులు వేడుకుంటున్నారు. గ్రామంలో పిచ్చికుక్క సంచారంతో పిల్లలకు బయటకు వచ్చి ఆడుకోవాలంటేనే భయంతో అల్లాడిపోతున్నారు. ముగ్గురు పిల్లలకు గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..రాజోలులో పిచ్చికుక్క స్వైర విహారం..ముగ్గురు చిన్న పిల్లలపై దాడి
అంబేద్కర్ కోనసీమ జిల్లాను వరుణుడు వదలడం లేదు. ఓ వైపు వరదలతో ప్రజల అల్లాడిపోతుంటే.. మరో వైపు పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాల్ని టెన్షన్ టెన్షన్కు గురి చేస్తున్నాయి. తాజాగా వీధి కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.

Translate this News: