Covid Effect : షాకింగ్.. కోవిడ్ దెబ్బకు.. అందరి ఆయుష్షూ తగ్గిపోయిందిగా.. 

కోవిడ్ మహమ్మారి కారణంగా, ప్రజల జీవితాలు 1.6 సంవత్సరాలు తగ్గాయి. ది లాన్సెట్ జర్నల్ తాజా పరిశోధనలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. 2020 - 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 13.1 కోట్ల మంది మరణించారు. వారిలో 1.6 కోట్ల మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు.

New Update
WHO: కరోనా మహమ్మారి ఎఫెక్ట్.. తగ్గిన ఆయుర్దాయం.!

Covid Effect On Age : ప్రస్తుతం  ప్రపంచంలోని ప్రజలు మునుపటి కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. ఇప్పుడు మనిషి సగటు ఆయుర్దాయం సుమారు 73 సంవత్సరాలు. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా, మనిషి సగటు జీవితకాలం(Lifetime) 1.6 సంవత్సరాలు తగ్గింది. ది లాన్సెట్ జర్నల్(The Lancet Journal) తాజా పరిశోధనలో ఈ సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త పరిశోధన కరోనా వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను వెల్లడి చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో అనేక ఇతర అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఈ ఇన్ఫెక్షన్(Covid Effect) లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. చంపినా వారిని చంపేయగా.. దాని బారిన పడి బయటకు వచ్చినవారిని కూడా కరోనా వదిలిపెట్టడం లేదు. దీని కారణంగా ఇటువంటి వారు అనేక ఇతర వ్యాధుల బారిన పడటం ప్రారంభించారు. ఇప్పటికీ వారు దాని నుండి కోలుకోలేకపోయారు.

నివేదికలోని ప్రధాన అంశాలు..
పరిశోధన ప్రకారం, మహమ్మారి(Covid Effect) వచ్చే వరకు ప్రపంచ ప్రజల సగటు ఆయుర్దాయం పెరుగుతూ వచ్చింది.  ఆయుర్దాయం అంటే ఒక వ్యక్తి తన పుట్టినప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు జీవించగలడు అనే లెక్క. ప్రజల సగటు వయస్సు 1950లో 49 ఏళ్లుగా ఉండగా, 2019లో 73 ఏళ్లకు పెరిగింది. కానీ 2019 - 2021 మధ్య ఇది ​​1.6 తగ్గింది.కోవిడ్ తీసుకువచ్చిన  అత్యంత తీవ్రమైన దుష్ప్రభావాలలో ఇది ఒకటని నిపుణులు అంటున్నారు. ఈ అధ్యయనం 2020-2021 సంవత్సరంలో నిర్వహించారు. ఈ కాలంలో 84 శాతం దేశాల్లో సగటు ఆయుర్దాయం(Covid Effect) క్షీణించిందని.. మెక్సికో సిటీ, పెరూ, బొలీవియా వంటి ప్రదేశాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని అధ్యయనం వెల్లడించింది.

Also Read : పొగతాగడంపై కఠిన చర్యలు తీసుకున్న దేశాలు ఇవే!

పురుషులలో మరణాల రేటు 22% పెరిగింది..
ఈ కాలంలో 15 ఏళ్లు పైబడిన వారి మరణాల రేటు పురుషుల్లో 22 శాతం, మహిళల్లో 17 శాతం పెరిగిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. 2020 - 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 131 మిలియన్ల(Covid Effect) మంది మరణించారని, వారిలో 16 మిలియన్ల మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారని వారు అంచనా వేస్తున్నారు. 2020 - 2021లో మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వయోజన మరణాల రేట్లు పెరిగాయని పరిశోధనలో తేలింది. అయినప్పటికీ, COVID-19 మహమ్మారి మధ్య శిశు మరణాల రేట్లు తగ్గుతూనే ఉన్నాయి. 2019తో పోలిస్తే 2021లో ఐదేళ్లలోపు పిల్లల మరణాలు ఐదు లక్షల తక్కువ.

Advertisment
తాజా కథనాలు