Abhishek Manu Singhvi: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సీరియస్

పోలింగ్ స్టేషన్‌లో పోలైన ఓట్ల సంఖ్యను ఎన్నికల సంఘం వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ డిమాండ్ చేశారు. మోదీ, అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఈసీ స్పందించకపోవడం దారుణమని అన్నారు.

Abhishek Manu Singhvi: ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ సీరియస్
New Update

Abhishek Manu Singhvi: పోలింగ్ స్టేషన్‌లో పోలైన ఓట్ల సంఖ్యను నమోదు చేసే ఫారం 17Cని బహిర్గతం చేయాలనే డిమాండ్‌పై కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ గురువారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)ని ప్రశ్నించారు.

ఆయన మాట్లాడుతూ.. " మేము ఫిర్యాదు చేసినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఏ పత్రంలోనూ ప్రధానమంత్రి, హోంమంత్రి పేర్లు ప్రస్తావించబడలేదు. కమిషన్ ఎవరినీ హెచ్చరించలేదు, ఎలాంటి ఆంక్షలు విధించలేదు, ఎటువంటి ఆరోపణలు చేయలేదు.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించవద్దని తమ స్టార్ క్యాంపెయినర్‌లను కోరుతూ రెండు పార్టీల అధ్యక్షులకు లేఖ రాసింది” అని అన్నారు.

“డేటా తారుమారు అవుతుందని, ఎవరైనా ఫోటోను మార్ఫింగ్ చేయవచ్చని ఎన్నికల సంఘం చెబుతోంది. ఈ సందర్భంలో ఏ డేటాను అప్‌లోడ్ చేయలేరు. ఎన్నికల సంఘం ఈ సమాధానం కేవలం తప్పించుకునే ప్రక్రియ మాత్రమే. అయితే ఎన్నికల కమిషన్‌కు డబ్బు చెల్లించి ఎవరైనా ఈ డేటాను పొందవచ్చు. అందుకే ఇది దురదృష్టకరం, ఎన్నికల కమిషన్‌కు ఏకపక్ష ధోరణి ఉందని చూపిస్తుంది” అని సింఘ్వీ అన్నారు.

#abhishek-manu-singhvi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe