MLA Sanjay: కవిత వల్లే రాజకీయాల్లోకి వచ్చాను.. సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

TG: ఎమ్మెల్సీ కవిత వల్లే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. తాను డబ్బు కోసం పార్టీ మారలేదని అన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కొరకే పార్టీ మారినట్లు క్లారిటీ ఇచ్చారు.

New Update
MLA Sanjay: కవిత వల్లే రాజకీయాల్లోకి వచ్చాను.. సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు

MLA Sanjay: కాంగ్రెస్ పార్టీ లో చేరిన తర్వాత మొదటిసారి మీడియా సమావేశం నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. తన రక్తం లోనే రాజకీయం ఉందని అన్నారు. తాను పుట్టిందే రాజకీయ కుటుంబం లో అని చెప్పారు. కవిత ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. జగిత్యాల ప్రాంత అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి తోనే సాధ్యమని భావించి కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు తెలిపారు.

జగిత్యాల పట్టణంలో ఉన్న నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ ల మౌలిక వసతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి 32 కోట్ల నిధులు కేటాయించారని కొనియాడారు. ప్రజాస్వామ్యం లో ప్రతిపక్ష పార్టీ ల కు అభివృద్ధి లో ప్రాధాన్యత ఉండదని అన్నారు. ఇతర పార్టీ ల నుండి గెలిచిన వారు బీఆర్ఎస్ పార్టీ లో మంత్రులు కాలేదా అని ప్రశ్నించారు. తనకు పార్టీ విడడం బాధగా ఉందని.. నన్ను నిందించిన వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు.

"తనకు ఉన్న ఆర్థిక పరిస్థితి తో 50 కుటుంబాల ను పోషిస్తా నా కుటుంబన్ని పోషించుకోవడం కోసం నేను పార్టీ మరల్సిన అవసరం లేదు. పీసీసీ జీవన్ రెడ్డి కి సమాచారం ఇవ్వడంలో లోపం జరిగింది. నేను జీవన్ రెడ్డి కలిసి పనిచేస్తాం" అని అన్నారు.

Advertisment
తాజా కథనాలు