MLC Jeevan Reddy: ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్

TG: కాంగ్రెస్‌ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ ప్రచారం దారుణం అని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్‌గాంధీ ప్రభుత్వం అని అన్నారు. రాజీవ్‌గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని పేర్కొన్నారు.

New Update
MLC Jeevan Reddy: ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కౌంటర్

MLC Jeevan Reddy:ప్రధాని మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అన్నారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. కాంగ్రెస్‌ వస్తే రామాలయాన్ని కూల్చేస్తారని మోదీ ప్రచారం దారుణం అని మండిపడ్డారు. మోదీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయోధ్యలో రామాలయం గేట్లు తెరిపించిందే రాజీవ్‌గాంధీ ప్రభుత్వం అని అన్నారు. రాజీవ్‌గాంధీ బతికుంటే రామాలయం నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేదని పేర్కొన్నారు. ఎన్నికల కోసం దేవుడిని వాడుకోవడం మంచిదికాదని హితవు పలికారు. మత సామరస్యానికి కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని అన్నారు.

ALSO READ: రేవంత్ సర్కార్ కు ఈసీ షాక్

Advertisment
తాజా కథనాలు