ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి (Congress Party) భారీ షాక్ తగిలింది. తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన నేతగా పేరు ఉన్న ఎర్ర శేఖర్ ఆ పార్టీని వీడారు. కేటీఆర్ (KTR) సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో (BRS Party) చేరి పోయారు. ఇప్పటినుంచి సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో పని చేస్తానని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ ప్రకటించారు. ఎర్ర శేఖర్ గతంలో జడ్చర్ల నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. జడ్చర్ల టికెట్ ఇస్తామని రేవంత్ రెడ్డి ఆసమయంలో ఆయనకు హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగింది.
ఇది కూడా చదవండి: TS Politics: బీజేపీకి మరో బిగ్ షాక్.. ఫామ్హౌస్లో వివేక్, రేవంత్ రెడ్డి చర్చలు?
TS Politics: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీఆర్ఎస్ గూటికి ఎర్ర శేఖర్!
కాంగ్రెస్ నేత ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రోజు ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Translate this News: