Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ

TG: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 8 స్థానాలకే పరిమితం కావడంపై కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. ఇవాళ గాంధీ భవన్‌కు కురియన్ కమిటీ సభ్యులు రానున్నారు. గెలిచిన ఎంపీలు, ఓడిన అభ్యర్థులతో కమిటీ భేటీ కానుంది. ఒక్కొక్కరితో విడివిడిగా కమిటీ సభ్యులు మాట్లాడనున్నారు.

New Update
Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ

Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ దృష్టి పెట్టింది. కురియన్ కమిటీ రంగంలోకి దిగింది. ఇవాళ గాంధీ భవన్‌కు కురియన్ కమిటీ సభ్యులు వెళ్లనున్నారు. ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోవడంతో కురియన్‌ కమిటీని కాంగ్రెస్‌ అధిష్టానం వేసిన సంగతి తెలిసిందే. గెలిచిన ఎంపీలు, ఓడిన అభ్యర్థులతో కమిటీ భేటీ కానుంది. ఒక్కొక్కరితో విడివిడిగా కమిటీ సభ్యులు మాట్లాడనున్నారు. 14 సీట్లు టార్గెట్‌ పెట్టుకుంటే 8 ఎందుకు వచ్చాయి?, సీఎం సొంత జిల్లాల్లోనూ ఎలా ఓడిపోయాం?, అభ్యర్థుల ఎంపికలో తప్పిదం జరిగిందా?, బీఆర్ఎస్ వెనుకబాటును ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయాం? అనే అంశాలపై విశ్లేషణ చేయనుంది.

Advertisment
తాజా కథనాలు