Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వివాదంలో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిపై కానిస్టేబుల్ దాడి చేయడం కలకలం రేపింది. పిడియూఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గురువారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో కంప్లైంట్ రాస్తుండగా ఓ కానిస్టేబుల్ దుర్భాషలాడుతూ తనపై దాడి చేశాడని, ఓ ఫైనాన్స్ కంపెనీపై కంప్లైంట్ ఇవ్వరాదని స్టేషన్ ఎస్ఐ కూడా తనను తిట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘ నాయకుడిగా, జూనియర్ ప్రాక్టీస్ అడ్వకేట్గా ఉన్న తాను ఫిర్యాదు చేయడానికి వస్తే పోలీసులు దౌర్జన్యం చేయడం సమంజసం కాదని అన్నారు. పోలీస్ స్టేషన్లోని సిసి కెమెరాలను పరిశీలించాలని, తన తప్పు ఏదైనా ఉంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని అన్నాడు. కానిస్టేబుల్ దాడిని ఖండిస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి మీడియాతో ఆవేదన వ్యక్తం చేశాడు.
పూర్తిగా చదవండి..Vikarabad: తాండూర్లో పోలీసుల అత్యుత్సాహం.. ఫిర్యాదు దారుడిపై కానిస్టేబుల్ దాడి!?
వికారాబాద్ జిల్లా తాండూర్ పోలీసులు ఫిర్యాదు చేయడానికి వచ్చిన శ్రీనివాస్ అనే వ్యక్తిపట్ల దురుసుగా ప్రవర్తించడం హాట్ టాపిక్ గా మారింది. కానిస్టేబుల్, ఎస్సై కాశీనాథ్పై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Translate this News: