Karnataka Accident: ఘోర రోడ్డు ప్రమాదం..రెండు లారీల మధ్య నుజ్జయిన కారు..ఏడుగురి మృతి!

కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ దారుణ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జుయ్యింది.

Karnataka Accident: ఘోర రోడ్డు ప్రమాదం..రెండు లారీల మధ్య నుజ్జయిన కారు..ఏడుగురి మృతి!
New Update

కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. ఈ దారుణ సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. రెండు లారీల మధ్య కారు నుజ్జునుజ్జుయ్యింది. సోమవారం సాయంత్రం ఈ ఘోరం జరిగింది. చిత్రదుర్గ-షోలాపూర్‌ ఎన్‌హెచ్‌ 50 పై హోసపేటకు చెందిన ఓ కుటుంబం మొత్తం మృతి చెందారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని హోసపేట సమీపంలోని ఉక్కడకేరికి చెందిన గోనిబసప్ప (65), కెంచమ్మ (80) , భాగ్యమ్మ (30), యువరాజ్‌ (5), సండూర్‌ కు చెందిన భీమలింగప్ప (50), అతని భార్య ఉమ (45) వారి కుమారుడు అనిల్ (30) బాధితులు హరపనహళ్లి తాలూకాలోని కులహళ్లిలోని గోనె బసవేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

Also read: 12 గంటల పాటు రాళ్ల గుట్టల్లో యువతి నరకయాతన!

వ్యాసనకెరె రైల్వే స్టేషన్ సమీపంలో కుడ్లిగి నుంచి వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి డివైడర్ పై నుంచి దూకి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇంతలో తమిళనాడు రిజిస్ట్రేషన్‌ తో వస్తున్న మరో లారీ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో వాహనం అదుపు తప్పి డివైడర్‌ పై నుంచి దూకి కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ క్రమంలోనే మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మృతుల్లో రెండేళ్ల బాలుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. రెండు లారీల డ్రైవర్లు పళని స్వామి, రాజేష్‌లతో పాటు బాలుడ్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

కారు నుజ్జు నుజ్జు కావడంతో బాడీలను బయటకు తీయడంలో పోలీసులు చాలా కష్టపడ్డారు. ఈ ప్రమాదంతో రహదారి మీద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: ఈడీ ముందుకు నవదీప్‌!

#road-accident #karnataka
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe