CM YS Jagan : శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ఈ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ముందస్తు ఎన్నికల అంశాన్ని ప్రస్తావించారు. షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పారు సీఎం జగన్. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వచ్చినా.. పూర్తి సన్నద్ధంగా ఉన్నామని సీఎం జగన్ అన్నారు. మంత్రులు మరింత సమర్థవంతంగా పని చేయాలంటూ దిశానిర్దేశం చేశారు సీఎం జగన్.
పూర్తిగా చదవండి..Andhra Pradesh : ‘ఏపీలో ఇదే జరుగొచ్చు’.. ఎన్నికలపై సీఎం జగన్ సంచలన కామెంట్స్..!
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ మాదిరిగానే.. తదుపరి ఎన్నికల షెడ్యూల్ కూడా ముందుగా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం.
Translate this News: