CM Revanth Reddy: ఆర్టీసీపై ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంపై రివ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో కొత్త బస్సులు, ఉద్యోగుల జీతాలపై.. ఆర్టీసీలో నెలకొన్న సమస్యలను సీఎంకు అధికారులు వివరించనున్నారు. ఫ్రీ బస్సు పథకంపై ఆరంభం నుంచే ప్రతిపక్షాల విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సరిపడా బస్సులు ఏర్పాటు చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు పథకంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
CM Revanth Reddy: ఉచిత బస్సుపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం?
TG: ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఉచిత బస్సు పథకంపై విపక్షాలు మొదటి నుంచి విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ పథకంపై రేవంత్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
New Update