CM Revanth Reddy: రేపు ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లనున్నారు.

CM Revanth Reddy: రేపు ఏపీకి సీఎం రేవంత్ రెడ్డి
New Update

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఏపీలో పర్యటించనున్నారు. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సభకు హాజరుకానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు కీలక కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు.క్  ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం రేవంత్ కు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇటీవల ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా నిన్న ప్రజాభవన్ లో ఇరు రాష్ట్ర సీఎంలు భేటీ అయిన విషయం తెలిసిందే. విభజన సమస్యలపై ఇరు నేతలు చర్చించారు.

publive-image సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న షర్మిల

ఇటీవల రేవంత్ తో షర్మిల భేటీ..

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరు కావాలని కోరారు. షర్మిల ఆహ్వానాన్ని స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా హాజరు అవుతానని చెప్పారు. అలాగే కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లతో సమావేశం అయినా షర్మిల.. వారిని కూడా ఆహ్వానించింది. కాగా ఈ సభకు దేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. రాహుల్ గాంధీ కూడా అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

#cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe