CM Revanth Reddy: చెప్పుతో కొడుతారు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

TG: అసెంబ్లీలో విపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో మంత్రి సీతక్కపై అవమానించిన తీరు చూస్తే చెప్పుతో కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెల్లిగా భావించే ఆదివాసి బిడ్డ సీతక్కను అవమానిస్తే ఊరుకుందామా అని ప్రశ్నించారు.

CM Revanth Reddy: చెప్పుతో కొడుతారు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
New Update

CM Revanth Reddy: అసెంబ్లీలో విపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో మంత్రి సీతక్కపై అవమానించిన తీరు చూస్తే చెప్పుతో కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చెల్లిగా భావించే ఆదివాసి బిడ్డ సీతక్కను అవమానిస్తే ఊరుకుందామా అని ప్రశ్నించారు. తన సొంత అక్కలుగా భావించి గతంలో సునీతా, సబితా ఇంద్రారెడ్డి కోసం తాను కొట్లాడిన అని అన్నారు. ఆరోజు పదవుల ఆ అక్కలు తనను వదిలేసి వెళ్లిపోయారని.. వాళ్ళ కోసం పోతే తనపై రెండు క్రిమినల్ కేసులు పెట్టారని.. ఆ కేసులపై ఇప్పటికి కోర్టుకు చుట్టూ తిరుగుతున్నానని అన్నారు. కానీ, ఇప్పుడు తనను నమ్ముకున్నా అక్కలు మంత్రులుగా ఉన్నారని తెలిపారు. దొర మాయలో పడి అక్కడ ఉండలేక.. బయటకు రాలేక ఇద్దరు అక్కలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని ఆరోపించారు. సొంత చెల్లి జైలులో ఉంటే రాజకీయాలు చేసే బుద్ధి వాళ్ళది అని ఫైర్ అయ్యారు.

#cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe