CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు అంశాలపై కీలక చర్చ

TG: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించారు. కేంద్రబడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న సమయంలో తెలంగాణ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు అంశాలపై కీలక చర్చ
New Update

CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై మోదీతో చర్చించారు. కేంద్రబడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న సమయంలో తెలంగాణ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం, డిప్యూటీ సీఎం. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ప్రాజెక్టుల కేటాయింపులపై చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారంపై ప్రధానికి వినతిపత్రం అందజేశారు.

ప్రధానితో సమావేశానికి ముందు హోంమంత్రి అమిత్‌షాతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ అయ్యారు. మరోవైపు ఉదయం ప్రధానితో సమావేశమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఇక విభజన సమస్యలపై ఈ నెల 6న ఇద్దరు సీఎంలు భేటీ కానున్నారు. అంతకుముందే ఒకరోజు ఇద్దరు సీఎంలు ప్రధాని, హోంమంత్రిని కలవడంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌ గా మారింది.

#cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe