సాయిచంద్ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి.. కన్నీటిపర్యంతం

సాయిచంద్...తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసన సమయంలో తన పాటతో కోట్లాది మందిని కదిలించారు. జానపదాన్ని నింపుకుని జనం గొంతుకై నిలిచిన పాటా వాడవాడలా ప్రతిధ్వనించింది. ఆయన పాటకు తెలంగాణ సమాజం ఉద్వేగంతో ఊగిపోయిందన్నారు సీఎం కేసీఆర్. ఉద్యమ సమయంలో సాయిచంద్ కీలక పాత్ర పోషించారని సాయిచంద్ మరణవార్త విన్న తెలంగాణ సమాజం షాక్‌కు గురైందన్నారు సీఎం.

New Update
సాయిచంద్ భౌతికకాయానికి కేసీఆర్ నివాళి.. కన్నీటిపర్యంతం

CM KCR paid tribute to Saichand's body

తెలంగాణ మంచి గాయకుడిని కోల్పోయింది

తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ భౌతిక కాయానికి పుష్పగుచ్ఛం ఉంచి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం సాయిచంద్ ఫ్యామిలీని ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం మంచి గాయకుడిని కోల్పోయిందన్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే బాల్కసుమన్ తదితరులు పాల్గొన్నారు.

గొప్ప గాయకున్ని..కళాకారున్ని కోల్పోయం

సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సిఎం సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం ఒక గొప్ప గాయకున్ని..కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరమని కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. రాష్టర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర అజరామరంగా నిలుస్తుందని సీఎం అన్నారు.

కుటుంబ సభ్యలకు సీఎం భరోసా

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను చేసిన సాంస్కృతిక ఉద్యమాన్ని సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలం నుంచి నేటి వరకు తన ఆట పాటలను నిరంతరాయం కొనసాగిస్తూనే ఉన్నాడని గుర్తు చేసుకున్నారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్పూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటని అన్నారు. శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాము అండగా వుంటామన్నారు. వారి కుటుంబ సభ్యలకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు