ఇటీవల గాయకుడు సాయిచంద్ గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ రోజు హైదరాబాద్‌ హస్తినాపురంలోని జీఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జరుగుతున్న సాయిచంద్‌ దశదిన కర్మకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. సాయిచంద్‌ చిత్రపటానికి పూలమాల వేసి, పూలు చల్లి పుష్పాంజలి ఘటించారు.