Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎవో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో కార్మికులు కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కూడా కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. “2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32% బోనస్ గా కార్మికులకు అందించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్ గారికి కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది” అని ఆమె పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Singareni Employees: సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త
సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ మరో శుభవార్త అందించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎవో ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీంతో కార్మికులు కేసీఆర్కు ధన్యవాదాలు చెబుతూ సంబరాలు చేసుకుంటున్నారు.
Translate this News: