24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వచ్చి మేము తాము అక్కడ రైతులకు 5 గంటల కరెంటు ఇస్తున్నాం అని చెబుతున్నాడని సీఎం కేసీఆర్ (CM KCR) ఫైర్ అయ్యారు. అంతకన్నా దిగజారుడు ఉంటదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో నమ్మి ఓటేస్తే గ్యారెంటీగా కాంగ్రెస్ (Congress) కరెంటును ఖతం చేస్తుందన్నారు. కాంగ్రెస్ వస్తే.. తెలంగాణ పరిస్థితి మళ్లీ మొదటికి వస్తదన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి పుట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ, తుంగతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడారు. కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఇది కూడా చదవండి: KTR Live: మా పాలన సంక్షేమానికి స్వర్ణయుగం.. మళ్లీ గెలిచేది మేమే: కేటీఆర్
CM KCR: తుంగతుర్తిలో కేసీఆర్ సంచలన హామీ
తుంగతుర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్ ను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గమంతా దళితబంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఖతం అవుతుందన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష అని అన్నారు కేసీఆర్.
Translate this News: