లబ్ధి కోసమే సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్ సెంటిమెంట్‌

మీరు చేసిన అభివృద్ధి ఎంటో చూపించండి సీఎం కేసీఆర్‌ అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. తొమ్మిది సంవత్సరాల కాలంలో మోడీ చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన పథకాలని‌ నేను చూపిస్తా అని బండి అన్నారు. కేంద్రం ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులని సందర్శించడం, ఇంటింటికి బీజేపీ దేశ వ్యాప్తంగా ప్రారంభమైందన్నారు.

లబ్ధి కోసమే సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్ సెంటిమెంట్‌
New Update

CM KCR feels that Congress is his

కేంద్ర పాలనను వివరిస్తాం..

తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి, కాంగ్రెస్‌లో ఉన్నవాళ్లు తనవాళ్లే అని సీఎం కేసీఆర్‌ ఫీలింగ్‌తో మరోసారి లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. ఒక్కో కార్యకర్త పోలింగ్‌బూత్‌లో వంద కుటుంబాల వద్దకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా కరీంనగర్‌లోని చైతన్యపురి 173వ పోలింగ్‌ బూత్‌ పరిధిలోని ప్రజలతో సంజయ్‌ మమేకమయ్యారు. 9 ఏళ్ల మోదీ పాలనను వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు.

ప్రజలపై బాధ్యత లేని సీఎం

అనంతరం బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరులకు కేసీఆర్‌ నివాళులర్పించలేదు. కేసీఆర్.. ఇవాళ ఏదో జిమ్మిక్కులు చేస్తారు. మేం టీవీలు పెట్టుకొని చూస్తాం. ధరణి బాధితులను పిలిస్తే పరేడ్‌ గ్రౌండ్‌లో పెద్ద సభే అవుతుంది. ఆ పథకాన్ని పూర్తిగా తన కుటుంబ అవసరాలకు ఉపయోగించుకున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కలిసి మొదటి విడతగా 30 మంది అభ్యర్థులను ఎంచుకున్నాయని, వారికి కేసీఆర్‌ ఫండింగ్ ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో గెలిస్తే తిరిగి బీఆర్‌ఎస్‌లోకి రావడానికే ఈ వ్యూహం. కేసీఆర్‌కి బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ మీదనే నమ్మకం ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నోళ్లందరూ మావాళ్లే అనే ఫీలింగ్‌లో సీఎం ఉన్నారని బండి సంజయ్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఏం చేసిన పబ్లిసిటీ కోసమే..

కేంద్ర ప్రభుత్వం అవాస్ యోజన కింద 2 ‌లక్షల 40 వేలు ఇండ్లు‌ కెటాయించిదన్నారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం క్వాలిటి‌ లేకుండా నిర్మించారని, నువ్వు ఎన్ని ఇండ్లు కట్టావో చూపుతే ఇంకా ఐదు లక్షల ఇండ్లు మోదీ వద్ద నుండి పట్టుక వస్తాను సీఎంకు బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ చేసిన పనులన్ని పబ్లిసిటీ కోసం వేల కొట్లు ఖర్చు పెడుతున్నారే తప్పా, రాష్ట్రంలో దళితులని‌ పట్టించు కోవటంలేదని మండిమడ్డారు. ఇంతవరకు నష్టబోయిన రైతులకి రూ.10 వేల పరిహారం ఇంకా అందలేదు. ప్రీ యూరియా అని‌ పత్తాలేకుండా పోయారని బండి గుర్తు చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe