CM Jagan: మళ్లీ అధికారం మనదే.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని సీఎం జగన్ అన్నారు చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఊహించలేని స్థాయిలో సీట్లు వస్తాయని అన్నారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని వ్యాఖ్యానించారు.

CM Jagan: మళ్లీ అధికారం మనదే.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
New Update

ఈరోజు విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌లో సీఎం జగన్ ఐ ప్యాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఊహించలేని స్థాయిలో సీట్లు వస్తాయని అన్నారు. 151 కంటే ఎక్కువ అసెంబ్లీ సీట్లు వస్తాయని.. 22 కన్నా ఎక్కువ ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4న ఏపీ ఫలితాలు చూసి దేశం షాకవుతుందని అన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రజలకు ఎక్కువగా మేలు చేద్దామని.. ప్రయాణం ఇలానే కొనసాగిద్దామంటూ పేర్కొన్నారు.

#cm-jagan #ap-politics
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe