MLA KTR: ఏపీలో గెలిచేది ఆ పార్టే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

TG: ఏపీలో మరోసారి జగన్ సీఎం అవుతారని అన్నారు కేటీఆర్. జగన్ గెలవబోతున్నారని తమ దగ్గర పక్కా సమాచారం ఉందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసే కుట్ర జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA KTR: ఏపీలో గెలిచేది ఆ పార్టే.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
New Update

MLA KTR: మీడియాతో చిట్‌చాట్‌తో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. తన సొంత జిల్లాలోనే రేవంత్‌రెడ్డి గెలవడం కూడా కష్టమే అని అన్నారు. తాను ఇన్‌ఛార్జిగా ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని రేవంత్‌ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారని ఆరోపించారు. ఏపీలోనూ ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నా అని తెలిపారు. మాకున్న సమాచారం ప్రకారం జగన్‌ ఏపీలో గెలుస్తున్నారని అన్నారు.

ALSO READ: సీఎం మమతకు తప్పిన పెను ప్రమాదం

మల్లారెడ్డి రాజకీయ వ్యూహంతోనే ఈటల మల్కాజ్ గిరిలో గెలవబోతున్నారని కామెంట్ చేశారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈటలను మునగచెట్టు ఎక్కించారు మల్కాజిగిరిలో కచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సే అని ధీమా వ్యక్తం చేశారు. అది ఈటల రాజేందర్‌కి కూడా తెలుసు అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్‌ మోసం పార్ట్ – 1, పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ -2 మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డి రుణమాఫీ చేయడని అన్నారు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదని విమర్శించారు.

#cm-jagan #mla-ktr #ap-elctions-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe