/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CHANDRABABU-POLA.jpg)
White Paper On Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు (Chandrababu Naidu). రాష్ట్రాభివృద్ధికి జీవనాడి పోలవరం అని అన్నారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేసినట్లు చెప్పారు. మేధావులు, నిపుణులు సహా అందరి సలహాలు తీసుకుంటాం అని అన్నారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలని పిలుపునిచ్చారు. ఏడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువగా నిధులు తెచ్చుకోవాలని అన్నారు. 25 రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వెబ్సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతాం అని అన్నారు. దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు వెల్లడించారు.