CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. డిమాండ్లు ఇవే!

AP: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం వంటి రాష్ట్రానికి సంబంధించిన ఆరు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు. దీనిపై మోదీకి చంద్రబాబు నివేదిక ఇచ్చారు.

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. డిమాండ్లు ఇవే!
New Update

CM Chandrababu: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో (PM Modi) సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలకు పైగా సమావేశం జరిగింది. ఏపీకి సంబంధించిన ఆరు అంశాలపై ప్రధానితో చర్చించారు. ప్రధానితో భేటీ కంటే ముందు పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు చంద్రబాబు. మధ్యాహ్నం 2.45 గంటలకు హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ కానున్నారు. ఆరు అంశాల్లో ఏపీకి సాయం అందించాలని ప్రధానికి చంద్రబాబు నివేదిక అందించారు.

మోదీ ముందు చంద్రబాబు డిమాండ్స్..

1. రాజధాని అమరావతి నిర్మాణం,
2. పోలవరం ప్రాజెక్ట్‌ వేగంగా పూర్తి చేయడం
3. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే
4 రహదారుల మరమ్మత్తులు
5. పట్టణ,గ్రామీణ పేదల ఇళ్లు
6. జలజీవన్‌ మిషన్‌ కింద ఇంటింటికీ తాగునీరు

#chandrababu-naidu #pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి