/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/CM-CHANDRABABU-1.jpg)
CM Chandrababu: వరద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం అని అన్నారు సీఎం చంద్రబాబు. జిల్లా మంత్రులు వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని చెప్పారు. వరద బాధిత కుటుంబాలకు రూ.3 వేలు తక్షణ సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అధికారులు పంట నష్టం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం అని భరోసా ఇచ్చారు. పైనుంచి వచ్చే వరద ప్రవాహం వల్లే ఎక్కువ నష్టం జరిగిందని చెప్పారు. వరద బాధితులకు గతం కంటే ఎక్కువ పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.