Cinema: నాగ చైతన్య- సమంత జంటగా నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ 'ఏ మాయ చేశావే మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. జులై 18న థియేటర్స్ గ్రాండ్ రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం చై- సామ్ మళ్ళీ కలుస్తారా? అనే చర్చ మొదలైంది.
మళ్ళీ కలుస్తారా?
అయితే వీరిద్దరూ విడిపోయిన తర్వాత కూడా వేర్వేరు సందర్భాల్లో ఈ సినిమా పట్ల తమకున్న ఇష్టాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. దీంతో చాలా మంది అభిమానులు, ముఖ్యంగా చై-సామ్ జంటను ప్రేమించినవారు.. వీరిద్దరూ కలిసి సినిమాను ప్రమోట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత సులభం కాదని సినీ వర్గాల టాక్.
#YeMayaChesave Grand Re-Releasing On 18th July 2025 💞#YMC4K @chay_akkineni @Samanthaprabhu2 @menongautham @arrahman @IndiraProdOffl pic.twitter.com/hulHGhqpTi
— Daya Arjun (@DayaArjun2) June 14, 2025
ఇద్దరి కెరీర్ లో మైలురాయిగా
ఈ సినిమా ద్వారా చై- సామ్ మళ్ళీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'ఏ మాయ చేశావే' చై- సామ్ ఇద్దరి కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడటం, ఆ తర్వాత వివాహం కూడా చేసుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్నేళ్ళకు పలు వ్యక్తిగత కారణాల చేత ఈ జంట విడిపోయింది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగ చైతన్య- సమంత ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. 'శుభం' సినిమాతో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన సామ్ తొలి మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. యూనిక్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంతో పాటు కొత్త కథను పరిచయం చేసింది సామ్. మరోవైపు నాగచైతన్య 'తండేల్' సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరారు.
Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!