Cinema: మళ్లీ కలవనున్న చై-సామ్: ఫ్యాన్స్ కోసమే!

నాగ చైతన్య, సమంత మళ్ళీ కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'ఏం మాయ చేశావే'ను రి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో మరోసారి వీరిద్దరి కలిసి మూవీని ప్రమోట్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

New Update

Cinema:  నాగ చైతన్య- సమంత జంటగా నటించిన  క్లాసిక్ లవ్ స్టోరీ  'ఏ మాయ చేశావే మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. జులై 18న థియేటర్స్  గ్రాండ్ రీ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కోసం  చై- సామ్ మళ్ళీ కలుస్తారా? అనే చర్చ మొదలైంది. 

మళ్ళీ కలుస్తారా?

అయితే వీరిద్దరూ  విడిపోయిన తర్వాత కూడా వేర్వేరు సందర్భాల్లో ఈ సినిమా పట్ల తమకున్న ఇష్టాన్ని, జ్ఞాపకాలను పంచుకున్నారు. దీంతో  చాలా మంది అభిమానులు, ముఖ్యంగా చై-సామ్ జంటను ప్రేమించినవారు.. వీరిద్దరూ కలిసి సినిమాను ప్రమోట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంత సులభం కాదని సినీ వర్గాల టాక్.

ఇద్దరి కెరీర్ లో మైలురాయిగా

ఈ సినిమా ద్వారా   చై- సామ్ మళ్ళీ ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం వస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 'ఏ మాయ చేశావే' చై- సామ్ ఇద్దరి కెరీర్ లో  ఒక మైలురాయిగా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడటం, ఆ తర్వాత వివాహం కూడా చేసుకున్నారు. కానీ,  దురదృష్టవశాత్తు కొన్నేళ్ళకు పలు వ్యక్తిగత  కారణాల చేత ఈ జంట విడిపోయింది. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నాగ చైతన్య- సమంత ఎవరి లైఫ్ లో వారు బిజీగా ఉన్నారు. 'శుభం' సినిమాతో  ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన సామ్ తొలి మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. యూనిక్ సబ్జెక్ట్ తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంతో పాటు కొత్త కథను పరిచయం చేసింది సామ్. మరోవైపు నాగచైతన్య  'తండేల్'  సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరారు. 

Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!

Advertisment
Advertisment
తాజా కథనాలు