Mangli Drugs Case: సింగర్ మంగ్లీ డ్రగ్స్ వ్యవహారంలో (Mangli Drugs Case) మరో షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో మంగ్లీ పోలీసు అధికారితో దురుసుగా మాట్లాడుతూ కనిపించింది. పోలీసులు ఆమె బర్త్ డే పార్టీలో డ్రగ్స్, భారీగా ఫారిన్ మద్యం స్వాధీనం చేసుకున్న అనంతరం.. ఘటన స్థలాన్ని వీడియో తీస్తుండగా మంగ్లీ పోలీస్ అధికారిపై రెచ్చిపోయింది. ''ఏయ్ ఆపు .. వీడియోలు తీయకు'' అంటూ దురుసుగా ప్రవర్తించింది. దీంతో పోలీసులు తమ డ్యూటీకి అడ్డురావద్దు అంటూ ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
అసలేం జరిగింది..
పలు కథనాలు తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 10న మంగ్లీ తన బర్త్ డే సందర్భంగా చేవెళ్ల త్రిపుర రిసార్ట్ లో పార్టీ నిర్వహించింది. అయితే ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు రిసార్ట్ పై దాడులు నిర్వహించగా.. భారీగా ఫారిన్ మద్యం, గంజాయి పట్టుబడ్డాయి. అనంతరం పార్టీలోని పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. 9 మందికి గంజాయి పాజిటివ్ గా తేలినట్లు సమాచారం. ఈ పార్టీకి మంగ్లీ కుటుంబ సభ్యులు, సెలెబ్రెటీలు సహా మొత్తం 48 మంది హాజరయ్యేరు. ఇందులో వీరిలో బిగ్బాస్ ఫేం దివి, లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్, కమెడియన్ రచ్చ రవి, సింగర్ ధనుంజయ్, మంగ్లీ సోదరి సింగర్ ఇంద్రావతి తదితరులు ఉన్నట్లు తెలిసింది.
మంగ్లీ పై కేసు
ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా బర్త్ డే పార్టీ నిర్వహించడం, ఫారిన్ మద్యాన్ని వినియోగించిన మేరకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు త్రిపుర రిసార్ట్ జీఎం శివరామకృష్ణపై, ఈవెంట్ ఆర్గనైజర్ దునే మేఘవత్, త్రిపుర రిసార్ట్ అసిస్టెంట్ మేనేజర్ రామకృష్ణ ఈవెంట్ ఆర్గనైజర్ స్నేహితుడు.దామోదర్ రెడ్డి తదితరుల పై కేసు నమోదైంది. NDPS యాక్ట్ ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు.
Also Read: HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?