తప్పు ఎవరిదైనా శిక్ష సమంతకేనా?.. ఆమెకే ఎందుకిలా..

అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత విడిపోయిన తర్వాత ఏ చిన్న విషయమైన ఆమెనే టార్గెట్ అవుతుంది. నాగచైతన్యతో విడిపోయినప్పుడు సమంతదే తప్పు అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్ కేసు విషయంలో ఆమె పేరే వినిపించింది. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ సైతం ఆమెపైనే తీవ్ర ఆరోపణలు చేశారు.

samantha
New Update

సమంత.. ఈ పేరు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడలింగ్‌గా కెరీర్ ప్రారంభించిన సామ్.. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2010లో ‘ఏ మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్‌‌కి పరిచయం అయింది. ఈ మూవీలో నాగ చైతన్య సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్‌తో బృందావనం, మహేశ్ బాబుతో దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. నానితో ఈగ, ఎటో వెళ్ళిపోయింది మనసు.. పవన్ కళ్యాణ్‌తో అత్తారింటికి దారేది సహా మరెన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌ హోదా సంపాదించుకున్న నటీమణులలో అందాల ముద్దుగుమ్మ సామ్ ఒకరు. ఓ వైపు తెలుగు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తమిళంలో పలు సినిమాలతో దూసుకుపోయింది. 

అయితే తన మొదటి సినిమా రీల్ హీరోనే తన లైఫ్‌లో రియల్ హీరోగా ఎంచుకుంది. ఎన్నో ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న సామ్ - చై ఎట్టకేలకు అక్టోబర్, 2017లో మ్యారేజ్ చేసుకున్నారు. ఈ ప్రేమ జంటను చూసి సినీ ప్రియులు, అభిమానులు ఎంతో మురిసిపోయారు. అంతేకాకుండా వీరు టాలీవుడ్ స్టార్ కపుల్స్‌గా గుర్తింపు పొందారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఈ మోస్ట్ లవ్ కపుల్ విడిపోతున్నట్లు అనౌన్స్ చేశారు. అక్టోబర్ 2, 2021న వ్యక్తిగత కారణాలతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో అంతా షాకైపోయారు. ఎంతో ఆనందంగా హ్యాపీ లైఫ్‌ను లీడ్ చేసిన ఈ జంట నాలుగేళ్లకే విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక అప్పటి నుంచి సమంత, నాగచైతన్యకు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. 

హీరో సిద్ధార్థ్‌తో ప్రేమాయణం

ముఖ్యంగా సమంత గత పదేళ్లుగా తరచూ మీడియాలో హైలైట్ అవుతూనే ఉంది. ఆమెకు సంబంధించిన ఏ చిన్న వార్త అయినా.. ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో హీరో సిద్ధార్థ్‌తో ప్రేమాయాణం సమయంలో బాగా హైలైట్ అయింది. అప్పట్లో సిద్ధార్థ్‌తో కలిసి శ్రీకాళహస్తి ఆలయంలో రాహు, కేతు పూజలు చేసి సంచలనంగా మారింది. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం బాగా చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా ఇందుకు సంబంధించిన వార్తలు సైతం హాట్ టాపిక్‌గా మారడంతో సమంత పేరు మారుమోగిపోయింది. అయితే ఆ తర్వాత నాగ చైతన్యతో ప్రేమ పెళ్లి చేసుకుంది. అనంతరం 4 ఏళ్ళ కాపురం తర్వాత విడాకులు తీసుకుంది.  

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదం

వివాదాలు ఒకదాని తర్వాత మరొకటి సమంతను వెంటాడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌ వివాదానికి సమంత బాగా టార్గెట్ అయింది. ఈ సిరీస్‌లో సమంత పాత్ర తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇందులో ఆమె టెర్రరిస్ట్‌గా కనిపించడంతో చిచ్చు మొదలైంది. తమిళులను కించపరిచే విధంగా ఉన్న పాత్రలో సమంత యాక్ట్ చేయడంపై ఎంతోమంది మండిపడ్డారు. చివరకు తమిళ ప్రభుత్వం సైతం తమ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా కూడా ఈ సిరీస్‌ను బ్యాన్ చేయాలని కేంద్రమంత్రికి లేఖ రాసింది. ఒక తీవ్రవాద పాత్రకు తమిళ నటిని తీసుకోవడం.. తమిళుల గౌరవంపై దాడి చేయడమేనని కొందరు ఫైర్ అయ్యారు. దీంతో సమంత పేరు మరింత మారుమోగిపోయింది. 

నాగ చైతన్యతో విడాకుల వివాదం

టాలీవుడ్ మోస్ట్ లవ్ కపుల్స్ ఎవర్రా అని అడిగితే అంతా నాగ చైతన్య అండ్ సమంత అని చెప్పుకునేవారు. అలాంటి ఈ జంట ఒక్కసారిగా విడిపోవడంతో అంతా షాక్ అయ్యారు. అయితే ఎందుకు విడిపోయారో చెప్పకపోవడంతో అంతా సమంతదే తప్పు అన్నట్లు గుసగుసలాడుకున్నారు. విడాకులకు మించిన వేదనను సమంత ఎదుర్కొన్నారు. అయినా సమంతదే తప్పు అన్నట్లు ఆమెపై ఎన్నో నిందలు వేశారు. ఆమెకు అఫైర్స్ అంటగట్టారు. పెళ్లైన తర్వాత సమంతకు సినిమాల్లో నటించాలని ఉండేదని.. అయితే దానికి అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకోలేదని ఆమెపైనే నిందలు మోపారు. అంతేకాకుండా సమంతకు పిల్లలు కనడం ఇష్టం లేదని అందుకే విడిపోవాలని నిర్ణయించుకుందని తననే బ్లెయిమ్ చేశారు. తన హ్యాపీనెస్ కోసమే సమంత నాగచైతన్యను, అక్కినేని ఫ్యామిలీని వదిలి బయటకు వచ్చేసిందని అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. 

ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా

విడాకుల అనంతరం సమంత కొద్ది రోజులు సినిమాలకు దూరం అయింది. ఆ తర్వాత పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌తో దర్శనమిచ్చింది. ఇందులో ‘ఊ అంటావా మావా ఉఊ అంటావా మావా’ అనే స్పెషల్ సాంగ్‌లో తన డ్యాన్స్‌తో దుమ్ముదులిపేసింది. అయితే దీని విషయంలో కూడా సమంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇలాంటి సాంగ్‌లు చేయడానికే నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకుంది అంటూ తీవ్ర ఆరోపణలకు గురైంది. ఈ సాంగ్‌‌ను సమంత చేయడంతో ఆమెపై చాలా మంది మండిపడ్డారు. 

జపమాల దండ వివాదం

నాగ చైతన్యతో విడాకుల అనంతరం సామ్ పలు సినిమాల్లో నటిస్తూ కెరీర్‌లో దూసుకుపోయింది. అందచందాలతో కుర్రకారును మంత్రముగ్దులను చేసింది. తన అభిమానులకు ఎప్పటికప్పుడు అందాలతో సర్‌ప్రైజ్ చేస్తూ ఉండేది. అయితే ఓ రోజు వైట్ డ్రెస్‌ వేసుకుని మెడలో దండతో సన్యాసిలా కనిపించి షాక్ ఇచ్చింది. అంతేకాకుండా శాకుంతలం మూవీ ట్రైలర్ ఈవెంట్‌లో చేతిలో జపమాల పట్టుకుని కనిపించింది. దీంతో కొందరు ఆమెపై మండిపడ్డారు. క్రిస్టియన్ అయిన సమంత హిందువులు ఎంతో పవిత్రంగా భావించే జపమాల దండను ధరించడం ఏమాత్రం మంచి పద్దతి కాదని ఆమెపై ఫైర్ అయ్యారు. అప్పట్లో అందుకు సంబంధించిన ఫొటోలు సైతం వైరల్ అయ్యాయి.  

డాక్టర్‌తో వివాదం

మయోసైటిస్ వ్యాధికి గురైన సమంత అప్పుడప్పుడు హెల్త్‌కి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు అందిస్తుంది. తన అఫీషియల్ ఇన్‌గ్రామ్ ఖాతా ద్వారా పలువురుని అలెర్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే సామ్ తన ఇన్‌స్టాలో పెట్టిన ఒక పోస్టు చర్చనీయాంశంగా మారింది. సామ్ నెబ్యులైజర్‌ను ఉపయోగిస్తున్న ఫొటోను షేర్ చేస్తూ.. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు డిస్టిల్డ్ వాటర్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ చెయ్యడంతో ఉపశమనం లభిస్తుందని చెప్పుకొచ్చింది. అయితే ఆ ఫార్ములా పై కొందరు డాక్టర్లు ఫైర్ అయ్యారు. అభయ్ ఫిలిప్ అనే ఒక లివర్ డాక్టర్ భగ్గుమన్నారు. సమంత చెప్పిన దాన్ని ఎవరైనా ఫాలో అయితే ప్రాణాలు కోల్పోతారని హెచ్చరించారు. హైడ్రోజన్ పెరాక్సైడ్ పీల్చడం వల్ల కలిగే ప్రమాదాలను అతడు చెప్పుకొచ్చాడు. ఇలాంటివి తెలియక తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్న సమంతపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నాడు. అప్పట్లో ఈ వివాదం బాగా సంచలనంగా మారింది. 

ఫోన్ ట్యాపింగ్ వివాదం

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు సెలబ్రిటీల ఫోన్లను ట్యాపింగ్ చేశారని అనేక ఆరోపణలు బయటకు వచ్చాయి. అయితే అందులో సమంత పేరు కూడా ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. సమంత - నాగ చైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ ముఖ్య కారణమని ఆరోపణలు వచ్చాయి. కేటీఆర్ వెనకుండి ఇదంతా చేయించారని కూడా పలు వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సమంత పేరు వార్తల్లోకెక్కింది. 

మంత్రి కొండా సురేఖ వివాదం

తాజాగా మంత్రి కొండా సురేఖ సమంత, అక్కినేని ఫ్యామిలీపై చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని మీడియా ముందు పెద్ద బాంబే పేల్చారు. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను అడ్డుపెట్టుకుని సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశాడని.. దీంతో నాగార్జున, సమంతను కేటీఆర్ వద్దకు వెళ్లమని చెప్పడంతో ఆమె నో చెప్పిందని మంత్రి కొండా సురేఖ చెప్పారు. అందువల్లనే వారిలో గొడవలు మొదలయ్యాయని.. వెళ్తే కేటీఆర్ దగ్గరకు వెళ్లు లేకుంటే విడాకులు తీసుకో అని నాగార్జున, సమంతకు చెప్పినట్లుగా మంత్రి చెప్పుకొచ్చారు. అందువల్లనే అలా చేయడం ఇష్టం లేక సమంత అక్కినేని ఫ్యామిలీకి దూరమైందని చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనిపై సినీ సెలబ్రిటీలు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఎంతో మంది మంత్రి సురేఖ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. దీంతో సమంత పేరు మరింత మారుమోగిపోతుంది. 

సమంతకే ఎందుకిలా?

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. అక్కినేని ఫ్యామిలీ నుంచి సమంత విడిపోయిన తర్వాత.. ఈ ఫ్యామిలీకి సంబంధించి ఏ చిన్న విషయమైన సమంతనే టార్గెట్ అవుతుంది. నాగచైన్యత్యతో విడిపోయినప్పుడు సమంతదే తప్పు అన్నారు. తెలిసిన సమాచారాన్ని ఇతరులకు చెప్పి అలర్ట్ చేసే పనిలో కూడా ఆమెనే వివాదంలో చిక్కుకుంది. ఆఖరికి రాజకీయ నాయకులు వారి వారి ప్రత్యర్థులను ఆరోపించే సమయంలో కూడా సమంత పేరే వినిపించింది. ఇలా ప్రతి విషయంలో ఆమెనే టార్గెట్ కావడం సమంతకు ఆమె ఫ్యాన్స్‌కు ఇది పెద్ద ఇబ్బందనే చెప్పాలి.

 

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe