Cinema:ఓటీటీలో అదరగొడుతున్న సాయి ధరమ్ తేజ్ హీరోయిన్ 'ఉత్సవం'

రెజీనా, దిలీప్ ప్రకాష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉత్సవం'. అక్టోబర్ 11న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. థియేటర్లలో మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ తెచ్చుకున్నప్పటికీ ఓటీటీలో అదరగొడుతోంది.

New Update
movie

Utasavam Movie: 

అర్జున్ సాయి దర్శకత్వంలో టాలీవుడ్ నటి రెజీనా,దిలీప్‌ ప్రకాశ్‌ లీడ్ రోల్స్ లో నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  'ఉత్సవం'. థియేటర్‌, సురభి నాటకాల ఆవశ్యకతను తెలియజేసే కథాంశంతో  సెప్టెంబర్ 13న థియేటర్స్ లో  విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. 

ఓటీటీలో సూపర్ హిట్ 

అయితే ఇటీవలే దసరా కానుకగా అక్టోబర్ 11న ఓటీటీలో విడుదలైన ఈ మూవీ థియేటర్ రిజల్ట్స్ కు భిన్నంగా ప్రేక్షకాదరణ పొందుతోంది. థియేటర్స్ లో యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం అదరగొడుతోంది.  మంచి మెసేజ్ ఉన్న స్టోరీ లైన్, యూత్‌ఫుల్‌ ప్రేమ కథాంశంతో సినీ ప్రియులను కట్టిపడేస్తుంది. ఓటీటీలో ఈ సినిమాకు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. చూడని వారు వెంటనే చూసేయండి.  హార్న్‌ బిల్‌ పిక్చర్స్‌పై సురేశ్‌ పాటిల్‌ నిర్మించిన ఈ సినిమాకు   అనూప్ రూబెన్స్ మ్యూజిక్  అందించారు.

Also Read: దీపావళికి మీ ఇంట్లో ఈ మొక్కలను నాటండి... అన్ని సుఖ సంతోషాలే!

Advertisment
Advertisment
తాజా కథనాలు