దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలో అనసూయ వివాదాస్పద చిత్రం!

యాంకర్ అనసూయ, ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రజాకార్'. తెలంగాణ చరిత్రలోని కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. పలు వివాదాల నడుమ విడుదలైన ఈ చిత్రం దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. త్వరలో 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.

New Update

ఓటీటీలో రజాకార్ 

పలు వివాదాలతో చుట్టుముట్టిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. దాదాపు 9 నెలల తర్వాత ఓటీటీలో వేదిక పై స్ట్రీమింగ్ కి వస్తోంది. త్వరలో రజాకార్ ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్  'ఆహా' రానుంది. ఈ  విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 20 లేదా 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. 

సమరవీర్ క్రియేషన్స్ LLP బ్యానర్ పై  గూడూరు నారాయణ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా చేసినట్లు నిర్మాత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు