/rtv/media/media_files/P4KHXkNvgEQSOjsrs1oo.jpg)
తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ - ప్రకాష్ రాజ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్స్ చేయడం.. వాటికీ పవన్ స్ట్రాంగ్ కౌంటర్లు వేయడం ఇలా వీళ్ళ మధ్య జరుగుతూ వస్తోంది.
దీంతో ఇది కాస్త వివాదంగా మారింది. తాజాగా ప్రకాశ్ రాజ్.. మరోసారి పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గాసెటైరికల్ ట్వీట్ వేశాడు. గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వాళ్లు చెప్పిన కొటేషన్స్ చెబుతూ పవన్పై కౌంటర్ వేశాడు.
Wishing you all happy #GandhiJayanti #LalBahadurShastriJayanti … Let this TRUTH sink into all of us 🙏🙏🙏 #justasking pic.twitter.com/AQV92znBHc
— Prakash Raj (@prakashraaj) October 2, 2024
పవన్ ను ఉద్దేశించేనా?
'నువ్వు మైనారిటీవి అయినా నిజం ఎప్పటికీ నిజమే -మహాత్మా గాంధీ. మనకు దేవాలయాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలు ఉన్నాయి. కానీ వీటిని ఎప్పుడూ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. ఇదే భారత్, పాకిస్థాన్ల మధ్య తేడా. -లాల్ బహదూర్ శాస్త్రి. మీ అందరికీ #గాంధీ జయంతి #లాల్ బహదూర్ శాస్త్రి జయంతి శుభాకాంక్షలు … ఈ సత్యాన్ని మనందరిలో నింపనివ్వండి జస్ట్ ఆస్కింగ్' అంటూ తన ఎక్స్ లో షేర్ చేసిన కొటేషన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.