పాపం పూజా హెగ్డే.. చివరికి అంతకు దిగజారిందా?

దళపతి విజయ్ లాస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఛాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం ఆమె తన రెమ్యునరేషన్ ను తగ్గించేసిందట. అందుకు వరుస ప్లాపులే కారణమని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

New Update

టాలీవుడ్  లో చాలా స్పీడ్ గా స్టార్ ఇమేజ్ కైవసం చేసుకుంది పూజా హెగ్డే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించి మెప్పించింది. సౌత్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ గానూ నిలిచింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అయితే గత రెండేళ్ల నుంచి ఈ హీరోయిన్ సినీ కెరీర్ చాలా డౌన్ లో ఉంది. ఈమె నటిస్తున్న సౌత్ సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అయ్యాయి. 

దాంతో బాలీవుడ్ కి వెళ్లి పలు అవకాశాలు అందుకుంది. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. అయినా ఏమాత్రం అధైర్యపడకుండా కెరీర్‌లో భారీ విజయం కోసం ప్రయత్నాలు చేస్తోంది. రీసెంట్ ఈ హీరోయిన్ కు కోలీవుడ్ లో భారీ ఆఫర్ వచ్చిన విషయం తెలిసిందే. దళపతి విజయ్ లాస్ట్ సినిమాలో పూజా హెగ్డేకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్ గా జరిగాయి. 

Also Read : విశ్వం ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్ ఖాతాలో హిట్ పడినట్లేనా?

ప్లాప్స్ ఎఫెక్ట్..

గతంలో భారీ పారితోషికాన్ని డిమాండ్‌ చేసే ఆమె దళపతి విజయ్ సినిమా కోసం తన రెమ్యునరేషన్ ను తగ్గించేసిందట. ఈ సినిమా కోసం పూజా హెగ్డే తక్కువ పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఎంత అనేది క్లారిటీగా తెలీకపోయినా పూజా హెగ్డే రెమ్యునరేషన్ బాగా తగ్గించేసిందనే వార్త కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం పూజాహెగ్డేకు తమిళం, హిందీల్లో అవకాశాలు బాగానే వస్తున్నా.. తెలుగులో మాత్రం ఇప్పటివరకు కొత్త సినిమా సైన్‌ చేయలేదు. దళపతి విజయ్ సినిమాతో పాటూ ఇటీవల తమిళంలో సూర్య 44 మూవీలో కూడా ఈ భామనే కథానాయికగా ఖరారైంది. ఈ రెండు సినిమాలతోనైనా బుట్టబొమ్మ సౌత్ లో కం బ్యాక్ ఇస్తుందేమో చూడాలి.

#acctress-pooja-hegde
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe