/rtv/media/media_files/2025/07/04/pawan-kalyan-son-with-mark-shankar-2025-07-04-12-45-03.jpg)
pawan kalyan son with mark shankar
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. పవన్ తో పాటు ఆయన కుమారులు అకీరా నందన్, మార్క్ శంకర్ కూడా వచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదం తర్వాత మార్క్ మొదటిసారి మీడియా ముందు కనిపించాడు. నివాసానికి చేరుకున్న అనంతరం పవన్ అధికారులతో, పార్టీ ప్రతినిధులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చించారు. ఆ తర్వాత మార్కాపురం నియోజక వర్గం పర్యటనకి బయలుదేరారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెద్ద కుమారుడు అకీరా నందన్, చిన్న కుమారుడు మార్క్ శంకర్ తో శుక్రవారం ఉదయం మంగళగిరిలోని తన నివాసానికి చేరుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో, పార్టీ ప్రతినిధులతో ముఖ్యమైన విషయాలపై చర్చించారు. అనంతరం మార్కాపురం నియోజక వర్గం… pic.twitter.com/v9IoVjeOQx
— JanaSena Party (@JanaSenaParty) July 4, 2025