Chiranjeevi : కడుపుబ్బా నవ్వించింది..మత్తు వదలరా 2 పై చిరు ట్వీట్!

శ్రీసింహా, కమెడియన్ సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలో నటించిన 'మత్తు వదలరా 2' పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. ఈ మధ్యకాలంలో ఇంతలా నవ్వించిన సినిమా తనకు కనపడలేదని. ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూశాను అని చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు.

author-image
By Archana
New Update
Mathu Vadalara 2

Mathu Vadalara 2

Mathu Vadalara 2 :  శ్రీసింహా , ఫరియా అబుద్దుల్లా, కమెడియన్ సత్య, సునీల్, వెన్నెల కిషోర్ (Vennela Kishore) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ 'మత్తు వదలరా 2’. 2019 లో విడుదలైన సూపర్ హిట్ ‘మత్తు వదలర’ సీక్వెల్ ఈ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 16న థియేటర్స్ లో రిలీజైన సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫుల్ లెంగ్త్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తాజాగా ఈ సినిమా పై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రశంసలు కురిపించారు. 'మత్తు వదలరా 2’ చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.

Also Read :  అప్పుడే ఓటీటీ విడుదలకు సిద్దమైన ‘తంగలాన్’..!

చిరంజీవి ట్వీట్

నిన్ననే 'మత్తు వదలరా - 2' సినిమా చూసాను. ఈ మధ్యకాలంలో మొదటి నుంచి చివరి వరకు ఇంతలా నవ్వించిన సినిమా నాకు కనపడలేదు. సినిమా ఎండ్ టైటిల్స్ కూడా వదలకుండా చూసాను. అంతలా నచ్చేసింది మూవీ. ఈ క్రెడిక్ అంతా దర్శకుడు రితేష్ రాణా కి ఇవ్వాలి. అతను తన రాత , తీత , కోత , మోత, ప్రతీ దాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను వినోద పర్చిన విధానాన్ని అభినందించకుండా వుండలేము. హ్యాట్స్ ఆఫ్ రితేష్ రాణా. నటీ నటులు సింహా , ఫారియా అబ్దుల్లా, ప్రత్యేకంగా కమెడియన్ సత్యకు నా అభినందనలు అని తెలియజేశాడు. అలాగే మూవీ కోసం శ్రమించిన అందరికీ అభినందనలు తెలిపారు.

Also Read :  క్యాన్సర్ చికిత్స సమయంలో ఈ వ్యాధుల ప్రమాదం పెరుగుతుందా?

Advertisment
తాజా కథనాలు