మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న 'మన శంకర వర ప్రసాద్గారు' మూవీ నుంచి మరో ఫుల్ సాంగ్ లిరికల్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఇది వరకు చిత్ర యూనిట్ మీసాల పిల్ల సాంగ్ను విడుదల చేయగా.. అది సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో కొనసాగుతూ అత్యధిక వ్యూస్ను రాబడుతోంది.
ఇది కూడా చూడండి: RajaSaab OTT: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ OTT డీల్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ప్లాట్ఫాం ఇదే..!
పెద్దగా రాని రెస్పాన్స్..
ఇప్పుడు శశిరేఖ అనే రెండో లిరికల్ సాంగ్ను మూవీ టీం విడుదల చేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఫోక్ సింగర్ మధు ప్రియ కలిసి పాడారు. అయితే విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట వ్యూస్ను రాబడుతోంది. కానీ ఈ సెకండ్ సింగిల్ సాంగ్కు అంత మంచి రెస్పాన్స్ అయితే రావడం లేదు. మీసాల పిల్ల సాంగ్కు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ అయితే ఈ పాట నుంచి రాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భీమ్స్ మ్యూజిక్ అన్నింటికి ఒకేలా ఉందని, సంక్రాంతికి వస్తున్నాం అనే పాటలానే ఉందని పలువురు అంటున్నారు. అలాగే లిరిక్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేవని చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Rajamouli Varanasi: మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్, అన్ని కలిపితే వారణాసి: దర్శకుడు దేవ కట్ట
ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కేవలం క్లైమాక్స్ మాత్రమే ఉందని సమాచారం. ఈ చిత్రం సంక్రాంతికి రావడానికి రెడీ అవుతోంది.
ఇది కూడా చూడండి: Rajasaab Premiers: అమెరికాలో గ్రాండ్ ప్రీమియర్కు రెడీ అయిన ప్రభాస్ ‘ది రాజా సాబ్’
Follow Us