రేప్ చేసినట్లు నిరూపిస్తే..నేనే వదిలేస్తా–జానీ మాస్టర్ భార్య

జానీ మాస్టర్ భార్య అయేషా సుమలత సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌‌ను రేప్ చేసినట్లు నిరూపిస్తే..నేనే జానీ మాస్టర్‌ను వదిలేస్తానని కామెంట్స్ చేశారు.  కావాలని తన భర్తను టార్గెట్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

author-image
By Manogna alamuru
New Update
master

Jani Master Wife Aayesha:

కోరియోగ్రాఫర్ లైగింక ఆరోపణల మీద జానీ మాస్టర్ భార్య ఆయేషా స్పందించారు. ఆ అమ్మాయిని 16 ఏళ్లకే రేప్ చేసినట్లు చెబుతున్నారు. అలా జరిగినట్లు ఆధారాలు చూపించాలని ఆమె అడిగారు. జానీ మాస్టర్ ఆ అమ్మాయిని రేప్ చేసినట్టు నిరూపిస్తే నేనే నా భర్తను వదిలేస్తానని ఆయేషా చెప్పారు. ఆ అమ్మాయికి చాలా ఎఫైర్లు ఉన్నాయి.
రెండేళ్ల నుంచే నాకు ఆ అమ్మాయిపై అనుమానం ఉంది. జానీ మాస్టర్‌తో చనువుగా ఉండాలని చూసేది. నా భర్త సినిమా అవకాశాలు కూడా ఇప్పించారు. ఆ అమ్మాయికి యూనియన్ కార్డు జానీ మాస్టరే ఇప్పించారు. లవ్ జీహాద్ అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అందరూ కలిసి జానీ మాస్టర్‌ను టార్గెట్ చేశారు అంటూ ఆయేషా మండిపడ్డారు. నా భర్త కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తున్నారు. జానీ మాస్టర్ ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూస్తున్నారు. జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉండడం వల్లే ఇదంతా చేస్తున్నారని ఆయేషా ఆరోపించారు. 

TFI

కొరియోగ్రాఫర్‌ జానీ పోలీసులకు పట్టుబడ్డానన్న వార్తల తర్వాత ఆయన భార్య అయేషా అలియాస్‌ సుమలత బయటకు వచ్చారు. ఒక మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. జానీ మాస్టర్‌‌తో తాను 14 ఏళ్ళ నుంచీ ఉంటున్నాను...నా భర్త తప్పు చేస్తే నేనే ఒప్పుకోను అన్నారు ఆయేషా. నేషనల్ అవార్డ్ వచ్చిన దగ్గర నుంచీ జానీని ఏదో రకంగా వేధిస్తున్నారు. 16 ఏళ్ళకే రేప్ చేశారని చెబుతోంది కదా..ఆధారాలను చూపించండి అంటూ ఆయేషా ప్రశ్నించారు. జానీ మాస్టర్‌‌తో ఉండడం ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు. ఆ కొరియోగ్రాఫర్‌‌కు చాలా మందితో సంబంధాలున్నాయి. చాలా మంది డాన్స్ మాస్టర్లతోనే ఎఫైర్స్ పట్టుకుంది. చాలామంది మాస్టర్ల వైఫ్‌లు కూడా కంప్లైంట్ చేశారు. ఆ అమ్మాయికి, ఆమె అమ్మకు ఒకటే లక్ష్యం. లగ్జరీగా బతకాలి, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలి. దాని కోసమే ఇదంతా చేస్తోంది అంటూ ఆయేషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ జానీ మాస్టర్ 16 ఏళ్ళ నుంచే రేప్ చేస్తున్నట్టు అయితే ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మాస్టర్‌‌తో పని చేయడం అదృష్టం అని ఎందుకు నవ్వుతూ చెప్పింది. ఎందుకు ఎప్పుడూ బాధగా ఉన్నట్టు కూడా కనిపించలేదు అంటూ ఆయేషా ప్రశ్నించారు. ఆ అమ్మాయి ఏం తప్పూచేయనప్పుడు తన ఫోన్ ఎందుకు దాచుకుంటోంది. ఫోన్‌లో ఉన్నవి ఎందుకు చూపించడం లేదని అడిగారు. అమ్మా, కూతుర్లు ఇద్దరూ కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆయేషా ఆగ్రహం వ్యక్తం చేశారు.

tfi1

అందరూ ఒకవైపే విని మాట్లాడుతున్నారు. లవ్ జీహాద్ అంటూ ఏమేమో మాటలాడుతున్నారు. నేను ఒక హిందూ, నా పేరు సుమలత. మా అత్తగారింట్లో నన్ను ఆయేషా అని పిలుస్తారు కానీ బయటంతా నన్ను సమలత అనే అంటారు. నేను హిందూ మతాన్నే ఆచరిస్తాను. పూజలు కూడా చేస్తాను. జానీ మాస్టర్ కూడా హిందూ మతాన్ని గౌరవిస్తారు. అలాంటప్పుడు లవ్ జీహాద్ అంటూ ఎలా కామెంట్లు చేస్తారు అంటూ ఆయేషా మండిపడ్డారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. రెండు వైపులా నిజం తెలుసుకోవాలని ప్రయత్నించడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: మా డబ్బులతో జగన్.. పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలనం!

 

Advertisment
తాజా కథనాలు